తెలంగాణ

telangana

By

Published : Sep 5, 2020, 5:34 AM IST

Updated : Sep 5, 2020, 2:08 PM IST

ETV Bharat / bharat

కరోనా నెగిటివ్​ రిపోర్ట్​ చూపితేనే పార్లమెంట్​లోకి అనుమతి!

పార్లమెంట్​ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు తప్పనిసరిగా కొవిడ్​-19 నెగిటివ్​ రిపోర్ట్​ చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి ఉభయ సభల సచివాలయాలు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశాయి. సభ్యుల వ్యక్తిగత నివేదికతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సిబ్బంది పరీక్షల నివేదికలూ సమర్పించాలని స్పష్టం చేశాయి.

Parliament during session
కరోనా నెగిటివ్​ రిపోర్ట్​ ఉంటేనే పార్లమెంట్​లోకి ఎంట్రీ!

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్​ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు తప్పనిసరిగా వారి వ్యక్తిగత, కుటుంబ సభ్యులు, సన్నిహితుల కొవిడ్​-19 నెగిటివ్​ రిపోర్ట్​ చూపాల్సి ఉంటుందని పేర్కొన్నాయి ఉభయ సభల సచివాలయాలు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశాయి. ఎంపీల సన్నిహితుల జాబితాలో పీఏ, పీఎస్​, డ్రైవర్​, పనిమనుషులను చేర్చాయి.

మార్గదర్శకాలు..

  • సమావేశాల ప్రారంభానికి 72 గంటల ముందే ఎంపీలు కరోనా పరీక్షలు చేయించుకోవాలి.
  • సొంత నియోజకవర్గంలోనైనా లేదా పార్లమెంటు ఆవరణలోనైనా పరీక్షలు చేయించుకోవచ్చు.
  • కొవిడ్​ పరీక్షల్లో నెగిటివ్​గా వస్తే నిరభ్యంతరంగా సమావేశాలకు హాజరుకావచ్చు.
  • పరీక్షల్లో పాజిటివ్​గా తేలితే​ వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్​కు వెల్లటం లేదా ఆస్పత్రిలో చేరాలి.
  • ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎంపీల కుటుంబ సభ్యులు, సిబ్బంది కూడా పరీక్షలు చేసుకోవాలి.
  • కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సిబ్బందిలో ఎవరికైనా పాజిటివ్​గా తేలితే.. సదరు పార్లమెంట్​ సభ్యుడు 14 రోజుల హోం క్వారంటైన్​కు వెళ్లాలి.
  • పార్లమెంట్​ సమావేశాల సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ఆరు అడుగుల మేర భౌతిక దూరం పాటించాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • ఎంపీలతో పాటు లోక్​సభ, రాజ్యసభ సచివాలయ సిబ్బంది కూడా కొవిడ్​-19 పరీక్షలు చేయించుకోవాలి.

కరోనా నేపథ్యంలో పార్లమెంట్​ సమావేశాలకు వేల సంఖ్యలో మాస్కులు, చేతి గ్లౌజులు, వందల కొద్ది శానిటైజర్​ బాటిళ్లు, ఫేస్​ సీల్డ్​లు అందుబాటులో ఉంచారు. స్వయంచాలితంగా తెరుచుకునే డోర్లు, చేతులు తగలకుండా పనిచేసే శానిటైజర్లు, థర్మల్​ స్క్రీనింగ్​ వంటి ఏర్పాట్లు చేశారు. ఎంపీలు, సిబ్బందితో పాటు సుమారు 4000 మందికి కరోనా పరీక్షలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

కరోనా కారణంగా తొలిసారి లోక్​సభ, రాజ్యసభ సమావేశాలు వేరువేరు సమయాల్లో నిర్వహిస్తున్నారు. సురక్షితంమైన సమావేశాల కోసం ఇప్పటికే లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖ, ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్​, డీఆర్​డీఓ అధికారులతో చర్చిస్తున్నారు.

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్​ 14న ప్రారంభమై అక్టోబర్​ 1న ముగియనున్నాయి.

ఇదీ చూడండి: లోక్‌సభలో వ్యవసాయదారులే అధికం... తెలంగాణ నుంచి ఆరుగురు

Last Updated : Sep 5, 2020, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details