తొలిరోజు..
- లక్షా 91 వేల మందికి కరోనా టీకాలు ఇచ్చాం: కేంద్ర వైద్యశాఖ
- 3,351 కేంద్రాల ద్వారా వ్యాక్సికేషన్ ప్రక్రియ: కేంద్ర వైద్యశాఖ
- వ్యాక్సికేషన్ ప్రక్రియలో 16,755 మంది వైద్యసిబ్బంది పాల్గొన్నారు: కేంద్రం
19:11 January 16
తొలిరోజు..
15:14 January 16
చెన్నైలో..
తమిళనాడులో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రిలో ఆరోగ్య కార్తకర్తలకు టీకాలను అందించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఆ సమయంలో అక్కడే ఉండి వారిలో ధైర్యం నింపారు.
14:49 January 16
ఆసుపత్రిని సందర్శించిన అమరీందర్ సింగ్..
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు. మొహలీలో టీకా పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.
13:32 January 16
టీకా వేసుకున్న పూనావాలా..
దేశంలో కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేసిన సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు.
13:04 January 16
ఏర్పాట్లను సమీక్షించిన యోగి..
ఉత్తర్ప్రదేశ్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. లఖ్నవూలోని బలరాంపుర్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో టీకాలను వేశారు. ఈ ఆసుపత్రిలో ఇవాళ 102 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు.
12:16 January 16
భాజపా కార్యకర్తల సంబరాలు..
దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభంపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముంబయిలోని ఘాట్గోపర్ ప్రాంతంలో టీకా పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో భాజపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చారు. కరోనా వైరస్ను పోలిన దిష్టి బొమ్మను దహనం చేశారు.
12:11 January 16
భూటాన్ ప్రధాని అభినందనలు..
12:06 January 16
సీఎం రూపానీ సమక్షంలో..
గుజరాత్ అహ్మదాబాద్లోని ప్రజా వైద్యశాలలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.
12:03 January 16
కశ్మీర్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ..
జమ్ముకశ్మీర్ శ్రీనగర్లోని షేర్-ఐ-కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలి టీకా డోసును అందుకున్న వలంటీర్ ఆనందం వ్యక్తం చేశాడు. తొలి డోసు తీసుకొని ఇతరులను ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు.
12:01 January 16
భారత్ బయోటెక్ టీకా డోసును చూపిస్తున్న హర్షవర్ధన్..
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా డోసును ఎయిమ్స్లో చూపించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్.
11:49 January 16
టీకా వేయించుకున్న ఎయిమ్స్ డైరెక్టర్..
11:19 January 16
2 డోసులు తప్పనిసరి..
కరోనా టీకా రెండు డోసులు తప్పకుండా తీసుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఒక డోసు తీసుకొని.. మరో డోసు తీసుకోకపోవడం లాంటి తప్పులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. టీకా తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలన్న మోదీ.. మాస్కుల వినియోగం, భౌతిక దూరం పాటించాలని కోరారు.
11:18 January 16
వారే హక్కుదారులు..
దేశంలో కరోనా కట్టడి కోసం.. ఆరంభం నుంచి అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర కరోనా వారియర్స్.. వ్యాక్సిన్కు మొదటి హక్కుదారులని ప్రధాని స్పష్టంచేశారు.
11:15 January 16
శాస్త్రవేత్తల కృషితోనే..
జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ.. ఒకేసారి రెండు దేశీయ తయారీ టీకాలు ప్రజలకు అందించిన శాస్త్రవేత్తలు అన్ని విధాల ప్రశంసనీయులని అన్నారు. అహోరాత్రులు శ్రమించి.. టీకాను తయారుచేసిన వారికి దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు చెబున్నానని పేర్కొన్నారు. ఈ టీకాల తయారీతో దేశ శాస్త్రవేత్తలు.. భారత సత్తాను మరోసారి ప్రపంచానికి చాటారని ఉద్ఘాటించారు. ఈ కారణంగానే భారత వైజ్ఞానిక సమర్థతపై ప్రపంచానికి విశ్వాసం పెరిగిందని అన్నారు. త్వరలోనే మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
11:04 January 16
10:59 January 16
ప్రజల సహకారంతోనే..
10:58 January 16
మోదీ నోట గురజాడ పలుకులు..
10:46 January 16
అప్పుడలా.. ఇప్పుడిలా..
10:40 January 16
టీకా వేసుకున్నా మాస్కులు తప్పనిసరి..
10:33 January 16
09:53 January 16
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సర్వం సిద్ధం
ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మరికాసేట్లో ప్రారంభం కానుంది. ఏడాదికి పైగా వేధిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణే లక్ష్యంగా దేశవ్యాప్త టీకాల పంపిణీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టునున్నారు. టీకాలు వేయించుకునేందుకు ఆరోగ్య కార్యకర్తలు తరలివస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా టీకా కేంద్రాలను సుందరంగా అలంకరించారు.
3006 కేంద్రాలలో 3 లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలకు నేడు టీకాలు వేయనున్నారు. వర్చువల్ విధానంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు మోదీ. పలువురు టీకా లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.
ఇవీ చూడండి: