తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 39 లక్షలు దాటిన కరోనా కేసులు - Corona death rate

దేశంలో కొవిడ్​-19 విలయతాండవం కొనసాగుతూనే ఉంది. తాజాగా 83,341 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్​ కారణంగా మరో 1,096 మంది మరణించారు. అయితే.. అదే స్థాయిలో రికవరీ రేటు మరింత పెరగడం ఊరటనిస్తోంది.

COVID-19 Single day spike of 83,341 new positive cases and 1,096 deaths reported in India, in the last 24 hours
దేశంలో కొత్తగా 83,341 కేసులు.. 1,096 మరణాలు

By

Published : Sep 4, 2020, 9:52 AM IST

Updated : Sep 4, 2020, 11:41 AM IST

దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తోంది. గురువారం ఒక్కరోజే 83,341 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 39లక్షలు దాటింది. మహమ్మారి సోకడం వల్ల మరో 1,096 మంది చనిపోయారు.

దేశంలో కరోనా కేసుల వివరాలు

దేశవ్యాప్తంగా గురువారం 11,69,765 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం టెస్టుల సంఖ్య 4 కోట్ల 66 లక్షలు దాటింది.

వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు

రికవరీలో మరింత పెరుగుదల..

పెరుగుతున్న కేసులకు అనుగుణంగా.. బాధితులు కూడా వేగంగా కోలుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్త రికవరీ రేటు 77.15 శాతంగా ఉంది. మరణాలు రేటు మరింత ఊరటనిస్తూ 1.74 శాతానికి తగ్గింది.

రాష్ట్రాల వారీగా కొవిడ్​ వ్యాప్తి

ఇదీ చదవండి:70% కరోనా మరణాలు ఆ ఐదు రాష్ట్రాల్లోనే

Last Updated : Sep 4, 2020, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details