తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా 'రికవరీ'లో ఆ 21 రాష్ట్రాలు భేష్ - కరోనా వైరస్​ ఇండియా

21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య జాతీయ సగటుకన్నా ఎక్కువ ఉందని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. అత్యధికంగా ఛండీగఢ్​లో 85.9 శాతం రికవరీ రేటు నమోదైందని వెల్లడించింది.

COVID-19 recovery rate in 21 states, UTs higher than national average of 60.77 pc: Health min
జాతీయ సగటు కన్నా ఆ 21 రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువ

By

Published : Jul 5, 2020, 4:35 PM IST

దిల్లీ, గుజరాత్​, ఉత్తర్​ప్రదేశ్​ సహా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా బాధితుల రికవరీ రేటు.. జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్​ నియంత్రణ, నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సమష్టి కృషితోనే ఇది సాధ్యపడిందని పేర్కొంది.

ఆదివారం నాటికి దేశంలో 6.73 లక్షల కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో ఇప్పటివరకు 4,09,082 మంది వైరస్​ను జయించినట్టు తెలిపింది ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకు.. 2,44,814 యాక్టివ్​ కేసులున్నట్టు స్పష్టం చేసింది.

ఇప్పటివరకు మొత్తం 14,856 మంది బాధితులు కోలుకున్నారని, ఫలితంగా జాతీయ రికవరీ రేటు 60.77 శాతానికి చేరిందని తెలిపింది ఆరోగ్య శాఖ.

రాష్ట్రం/యూటీ రికవరీ రేటు(శాతం)
ఛండీగఢ్​ 85.9
లద్దాఖ్​ 82.2
ఉత్తరాఖండ్​ 80.6
రాజస్థాన్​ 80.1
మిజోరం 79.3
త్రిపుర 77.7
మధ్యప్రదేశ్​ 76.9
ఝార్ఖండ్​ 74.3
బిహార్​ 74.2
హరియాణా 74.1
గుజరాత్​ 71.9
పంజాబ్​ 70.5
దిల్లీ 70.2
మేఘాలయ 69.4
ఒడిశా 69.0
ఉత్తరప్రదేశ్​ 68.4
హిమాచల్​ప్రదేశ్​ 67.3
బంగాల్​ 66.7
అసోం 62.4
జమ్ముకశ్మీర్​ 62.4

ఇదీ చూడండి:-ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ ఆసుపత్రి దిల్లీలో..

ABOUT THE AUTHOR

...view details