లాక్డౌన్ సడలింపుల తర్వాత భారత్లో కరోనా విజృంభిస్తోంది! శుక్రవారం రికార్డుస్థాయిలో 6వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 1లక్ష 18,447 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 148 మంది వైరస్కు బలయ్యారు. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 3,583కు చేరింది. 48,534 మంది కొవిడ్నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో వరుసగా ఆరో రోజు రెండువేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కొత్తగా 2,940 మందికి మహమ్మారి సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం 44,852 మంది వైరస్ బారిన పడినట్లు పేర్కొన్నారు. మరో 63 మంది చనిపోగా.. మరణించిన వారి సంఖ్య 1,517కు పెరిగిందని స్పష్టం చేశారు అధికారులు.
600కుపైగా కేసులు
దిల్లీలోనూ రికార్డుస్థాయిలో 660 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 12,319కి చేరింది. ఇప్పటివరకు 208 మంది మృత్యువాత వడ్డారు.