కరోనా వైరస్ భారత్పై పంజా విసురుతోంది. మొత్తంగా 5,194మందికి వైరస్ సోకినట్లు నిర్ధరించారు అధికారులు. 12 గంటల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఫలితంగా... వైరస్ కారణంగా కన్నుమూసిన వారి సంఖ్య 149కి చేరింది. దేశంలో 4643 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
పుణెలో ఇద్దరు..
మహారాష్ట్రలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. పుణెలో వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా లక్షణాలతో పుణెలోని ఆసుపత్రిలో చేరాడు ఓ వ్యక్తి. మంగళవారం ఆరోగ్యం క్షీణించిన కారణంగా మృతి చెందాడు. నగరంలోని సస్సూన్ ఆసుపత్రిలో వైరస్ కారణంగా మరో వ్యక్తి మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పుణెలో మహమ్మారితో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. మొత్తంగా మహారాష్ట్రలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు.
ధారావిలో మరో ఇద్దరికి..