తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2020, 8:31 PM IST

ETV Bharat / bharat

కరోనా వేళ బంగ్లాదేశ్​కు భారత్ ఆపన్న హస్తం

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న వేళ పొరుగుదేశం బంగ్లాదేశ్​కు ఆపన్న హస్తం అందించింది భారత్. కరోనాను తగ్గిస్తోందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు, సర్జికల్ చేతి తొడుగులను పంపించింది.

bangla
కరోనా వేళ బంగ్లాదేశ్​కు భారత్ ఆపన్న హస్తం

కరోనా విజృంభిస్తున్న వేళ పొరుగుదేశం బంగ్లాదేశ్​కు బాసటగా నిలిచింది భారత్. లక్ష హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు, 50 వేల సర్జికల్ చేతి గ్లవుజులను పంపించింది. భారత రాయబారి రివా గంగూలీ దాస్.. ఈ కరోనా వైద్య ఉపకరణాలను బంగ్లాదేశ్​ ఆరోగ్య మంత్రి జాహీద్ మాలిక్​కు అందించారు. భారత్-బంగ్లాదేశ్ మైత్రి సుదృఢమవ్వాలని ఆకాంక్షించారు. ఆపద సమయంలో మిత్రదేశం నుంచి వచ్చిన సాయాన్ని స్వాగతించింది బంగ్లాదేశ్.

కరోనాపై ఉమ్మడి పోరాటం చేయాలని పేర్కొంటూ సార్క్ సభ్యదేశాలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది భారత్. వైరస్​పై పోరులో పరస్పరం సహకరించుకోవాలని ఉద్ఘాటించింది. ఈ క్రమంలోనే బంగ్లాకు వైద్య ఉపకరణాలను అందజేసినట్లు పేర్కొన్నారు భారత రాయబారి. ఇంతకుముందే వైద్య సిబ్బందికి అవసరమైన ఉపకరణాలను అందించినట్లు తెలిపారు. బంగ్లాకు సహకారంపై ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

"భారత్, బంగ్లాదేశ్ మైత్రి బలమైనది. పొరుగుదేశాలు ప్రధానం అన్న విధానంలో మాకు బంగ్లాదేశ్ మొదటిది. మేం అన్ని వేళలా మీతో ఉంటాం. గతంలోనూ మీకు సహకారం అందించాం. భవిష్యత్తులోనూ ఈ సహకారం కొనసాగుతుంది."

-రీవా గంగూలీ దాస్, బంగ్లాదేశ్​లో భారత రాయబారి

బంగ్లాదేశ్​లో ఇప్పటివరకు 5400 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 145మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:కుష్టు వ్యాధి వ్యాక్సిన్​తో కరోనా చికిత్స!

ABOUT THE AUTHOR

...view details