దేశంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్ బాధితుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేసింది. గతంలో వైరస్ కేసులు రెండింతలయ్యేందుకు కేవలం 25.5 రోజులు పట్టేది. అయితే.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 73గా మారిందని పేర్కొంది ఆరోగ్యశాఖ.
సానుకూలంగా రికవరీ రేటు