తెలంగాణ

telangana

కొవిడ్​-19పై పోరాటానికి విరాళాల వెల్లువ

By

Published : Mar 24, 2020, 5:26 AM IST

కరోనాను తరిమికొట్టడానికి పలు రాష్ట్రాలు సకల విధాలా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొవిడ్-19పై పోరుకు నిధులను ఏర్పాటు చేస్తున్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. పంజాబ్​ కేబినెట్ మంత్రులు ఒక నెల వేతనాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నారు.

Covid-19 crisis: Odisha CM creates fund, donates three months' salary
కొవిడ్​-19పై పోరాటానికి విరాళాల వెల్లువ

మహమ్మారి కరోనాను ఎదుర్కోడానికి ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తి నియంత్రణకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి అధికారులు, నాయకులు, గవర్నర్​లు తమ నెల జీతాలను విరాళాలుగా ప్రకటిస్తున్నారు . కొన్ని రాష్ట్రాల్లో పేద ప్రజలకు సహాయంగా భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి ప్రభుత్వాలు.

మూడు నెలల జీతం

కరోనా సంక్షోభం నుంచి బయట పడటానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​. తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు​. ప్రజలు తమ వంతు సాయంగా విరాళాలు ఇవ్వాలని కోరారు. వైరస్​పై అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు.

విరాళంగా నెలజీతం

పంజాబ్​ కెబినేట్​ మంత్రులు ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. శిరోమని అకాళీ దళ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ ఐఏఎస్​ అధికారులు కూడా ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.

రాజస్థాన్​ సీఎం కరోనా ప్యాకేజి

కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​​ రూ.2వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించారు. దీని ద్వారా 1.41కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

సీఎం సహాయ నిధికి ఒక నెల జీతం (రూ.3.5లక్షల) విరాళంగా ప్రకటించారు రాజస్థాన్​ గవర్నర్​ కల్ ​రాజ్​ మిశ్రా. గవర్నర్​ సహాయ నిధి నుంచి రాష్ట్ర సీఎం సహాయ నిధికి రూ. 20లక్షలు పంపించినట్లు రాజ్​భవన్​ ప్రకటనలో తెలిపింది.

గంభీర్​ రూ.50లక్షల నిధులు

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న దిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య పరికరాల కోసం ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు మాజీ క్రికెటర్, తూర్పు దిల్లీ ఎంపీ గౌతం గంభీర్.

ఉచిత భోజనం

ఇందిరా క్యాంటీన్​ ద్వారా కర్ణాటకలోని పేదలకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప.

350 కిచిడీ కేంద్రాలు

పేదల కోసం ఝార్ఖండ్​లో రాష్ట్రవ్యాప్తంగా 350కు పైగా 'కిచిడీ' కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇదీ చూడండి:రూ.10కోట్లు విలువైన మాస్కులు మాయం!

ABOUT THE AUTHOR

...view details