సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు జరగనున్నాయి. వీటితో పాటు మార్కులు మెరుగుపరచుకోవాలనుకుంటున్న 12వ తరగతి విద్యార్థులకూ పరీక్షలు నిర్వహించనుంది సీబీఎస్ఈ.
ఈ నెల 22 నుంచి సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు - CBSE Exam Controller Sanyam Bhardwaj
ఈ నెల 22 నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది సీబీఎస్ఈ. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు, శానిటైజర్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
![ఈ నెల 22 నుంచి సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు CBSE class 10, 12 compartment exams to be held from Sep 22-29](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8684638-thumbnail-3x2-cbse.jpg)
ఈ నెల 22 నుంచి సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు
కొవిడ్-19 నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లను సొంతంగా తీసుకురావాలని సీబీఎస్ఈ ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు కరోనా పరిస్థితుల్లో సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేయాలంటూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టులో తీవ్ర వ్యతిరేకతను తెలియజేసింది సీబీఎస్ఈ. విద్యార్థుల భధ్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని సురక్షిత చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలిపింది. కేసును కోర్టు ఈనెల 10కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!