తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర, తమిళనాడులో తగ్గుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గాయి. మహారాష్ట్ర సహా దిల్లీ, తమిళనాడులో కొత్త కేసులు భారీగా తగ్గాయి. మహారాష్ట్రలో ఇవాళ 7760 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 300 మరణాలు నమోదయ్యాయి. దిల్లీలో కొత్తగా 674 మందికి కరోనా సోకింది.

By

Published : Aug 4, 2020, 7:59 PM IST

Updated : Aug 4, 2020, 9:30 PM IST

COVID-19 cases in Uttar Pradesh cross 1 lakh-mark; death toll climbs to 1,817
తమిళనాడులో కరోనా విలయం.. 5 వేల మందికి వైరస్​

భారత్​లో ఇవాళ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మహారాష్ట్రలో మంగళవారం 7,760 మందికి వైరస్​ సోకింది. మరో 300 మరణాలు సంభవించాయి.

తమిళనాడులో కొత్తగా 5,063 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2,68,285కు పెరిగింది. మృతుల సంఖ్య 4,349కి ఎగబాకింది. ఉత్తర్​ప్రదేశ్​తో పాటు పలు రాష్ట్రాల్లో వైరస్​ తీవ్రంగా విస్తరిస్తోంది.

లక్షకు పైగా కొవిడ్​ బాధితులు

ఉత్తర్​ప్రదేశ్​లో కొవిడ్​ బాధితుల సంఖ్య లక్ష మార్కును దాటింది. కొత్తగా 2,948 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మరో 41 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 1,00,310కు పెరగగా... మృతుల సంఖ్య 1817కు చేరింది. ​57వేల మందికిపైగా కొవిడ్​ నుంచి బయటపడ్డారు.

కేరళ..

కేరళలో తాజాగా 1,083 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,950కు చేరగా... మరణాల సంఖ్య 87కు పెరిగింది.

ఒక్కరోజులో తక్కువ మరణాలు..

దిల్లీలో కొత్తగా 674 మందికి వైరస్​ సోకింది. మరో 12 మంది చనిపోయారు. ఒక్కరోజులో నమోదైన మరణాల్లో ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 1,39,156కు చేరింది. ఇప్పటివరకు 4,033 మంది మరణించారు.

ఇదీ చూడండి:రామ్​లల్లా వస్త్రాలంకణ బాధ్యత లాల్​ కుటుంబానిదే!

Last Updated : Aug 4, 2020, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details