తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విజయ్​మాల్యా ఆస్తుల జప్తునకు దిల్లీ కోర్టు ఆదేశాలు

బెంగళూరులోని లిక్కర్​ కింగ్ విజయ్​ మాల్యా ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక పోలీసులను దిల్లీ కోర్టు ఆదేశించింది. విదేశీ మారక నియంత్రణ చట్టం(ఫెరా) ఉల్లంఘన కేసులో న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

By

Published : Mar 23, 2019, 3:01 PM IST

విజయ్ మాల్యా

మాల్యా ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశం
లిక్కర్​ కింగ్ విజయ్​ మాల్యాపై మరో వేటు పడింది. బెంగళూరులోని మాల్యా ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక పోలీసులకు దిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది. విదేశీ మారక నియంత్రణ చట్టం (ఫెరా) నిబంధనల ఉల్లంఘనపై తాజాగా నిర్ణయం తీసుకున్నారు న్యాయమూర్తి దీపక్ షెరావత్.

మాల్యా ఆస్తులను జులై 10 లోపు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు. నగరంలో మొత్తం మాల్యాకు చెందిన 159 ఆస్తులు ఉన్నట్టు బెంగళూరు పోలీసులు కోర్టుకు తెలిపారు.

మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈ ఏడాది జనవరి 4న ప్రకటించింది. ప్రస్తుతం మాల్యా లండన్​లో నివాసముంటున్నాడు.

ఇదీ చూడండి:జమ్ము వేర్పాటువాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం

ABOUT THE AUTHOR

...view details