తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నగదుబదిలీ కేసులో వాద్రాకు ఊరట

రాబర్ట్​ వాద్రా ముందస్తు బెయిల్​ గడువును ఈ నెల 25 వరకు పొడగిస్తూ దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. అక్రమ నగదు బదిలీ కేసులో నిర్బంధ విచారణ అవసరమని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కోర్టుకు తెలిపింది. ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

By

Published : Mar 19, 2019, 7:02 PM IST

Updated : Mar 19, 2019, 9:06 PM IST

రాబర్ట్​ వాద్రా

రాబర్ట్​ వాద్రాకు మరోమారు ఊరట
అక్రమ నగదు బదిలీ కేసులో రాబర్ట్​ వాద్రాకు మరోమారు ఊరట లభించింది. ముందస్తు బెయిల్​ గడువును ఈ నెల 25 వరకు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది దిల్లీ హైకోర్టు. వాద్రాపై నిర్బంధ విచారణ అవసరమని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కోరిన నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని వాద్రాను ఆదేశించింది.

ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ వాద్రాకు​ ముందస్తు బెయిల్​ను మంజూరు చేశారు.

లండన్​లో రూ.17.34 కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వాద్రాపై కేసు నమోదు చేసింది ఈడీ. గత నెల 16న అరెస్ట్​ నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్​ మంజూరు చేసింది కోర్టు.

వాద్రాకు చెందిన మరిన్ని ఆస్తుల వివరాలు సేకరించినట్లు ఈడీ పేర్కొంది. అందులో రూ.82.23 కోట్ల విలువైన రెండు ఇళ్లు, మరో ఆరు ప్లాట్లు, ఇతర ఆస్తులు ఉన్నట్లు తెలిపింది.

Last Updated : Mar 19, 2019, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details