తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరువు హత్య: ప్రేమికుల సజీవ దహనం

ఉత్తరప్రదేశ్​లోని కర్చా గ్రామంలో ఓ ప్రేమ జంటకు నిప్పు అంటించి, సజీవ దహనం చేశారు యువతి కుటుంబసభ్యులు. పరువు హత్య కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Aug 6, 2020, 1:43 PM IST

Couple burnt alive in 'honour killing' in Uttar Pradesh
పరువు హత్య: ఉత్తరప్రదేశ్​లో ప్రేమికుల సజీవ దహనం

ఉత్తరప్రదేశ్​లోని బాందాలో ఓ 19 ఏళ్ల యువతి, ఆమె ప్రియుడిని సొంత కుటుంబసభ్యులు సజీవ దహనం చేశారు. ఈ ఘటనను పోలీసులు పరువు హత్యగా పరిగణిస్తున్నారు.

పరువు హత్య: ఉత్తరప్రదేశ్​లో ప్రేమికుల సజీవ దహనం

కర్చా గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. యువతి, ప్రియుడిని పట్టుకున్న ఆమె కుటుంబసభ్యులు.. ఓ గుడిసెలో వారిని బంధించారు. అనంతరం ఆ గుడిసెకు నిప్పంటించినట్టు పోలీసులు తెలిపారు.

"ఘటన అనంతరం వారిద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారి పరిస్థితి విషమంగా ఉంది. అక్కడే భోలా(23) మరణించాడు. యువతి ప్రియాంకను వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది."

--- మహేంద్ర ప్రతాప్​ సింగ్​, అదనపు ఎస్​పీ.

యువతి కుటుంబానికి చెందిన తొమ్మది మందిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఆసుపత్రిలో
భోలా మృతదేహం

ఇదీ చూడండి:-ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు

ABOUT THE AUTHOR

...view details