తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా సర్కార్ మునుగుతున్న నావ: మాయ

ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. దేశానికి 'చాయ్​వాలా, చౌకీదార్' ప్రధాని అవసరం లేదని, నీతి నియమాలున్న వారే ఆ పదవిని చేపట్టాలని లఖ్​నవూ వేదికగా ఉద్ఘాటించారు.

By

Published : May 14, 2019, 2:03 PM IST

దేశానికి నీతిమంతమైన ప్రధాని కావాలి: మాయావతి

నీతి నియమాలున్న వారే ప్రధాన మంత్రి పదవిని చేపట్టాలన్నారు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై లఖ్​నవూ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. భాజపా ప్రభుత్వం మునిగిపోతున్న నావగా అభివర్ణించారు. ఈ కారణంగానే మోదీకి ఆర్​ఎస్​ఎస్ సహకరించడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం కారణంగా మోదీపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు మాయావతి.

దేశానికి 'చాయ్​వాలా, చౌకీదార్' ప్రధాని అవసరం లేదు: మాయావతి

" ప్రజా వ్యతిరేకతను చూసి భాజపా ఎన్నికల ప్రచారంలో ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదు. దీనివల్ల మోదీకి చెమటలు పడుతున్నాయి. దేశం ఇప్పటివరకు సేవకుడు, ప్రధాన సేవకుడు, చాయ్​వాలా, కాపలాదారు వంటి నేతలను చూసింది. దేశానికి ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే, నీతి నియమాలు పాటించే ప్రధాని కావాలి."

-మాయావతి, బీఎస్పీ అధినేత్రి

ABOUT THE AUTHOR

...view details