కరోనా వైరస్ నేపథ్యంలో 647 మంది భారతీయులను చైనా వుహన్ నుంచి రెండు ప్రత్యేక విమానాల ద్వారా తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. మొత్తం 68 మందికి మోదీ సంతకం చేసిన ప్రశంసాపత్రాలను విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అందజేశారు.
"ఈ సమావేశం ఎంతో ప్రత్యేకం. వృత్తి పట్ల మీకున్న గౌరవానికి ఇది ప్రతీక. వాణిజ్య అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నప్పటికీ దేశంపై ఎయిర్ ఇండియా అంకితభావం కలిగి ఉంది. ఇది ఓ ఉన్నత సంస్థ. ప్రస్తుతం ఎయిర్ ఇండియా 42 అంతర్జాతీయ, 82 దేశీయ గమ్యస్థానాలకు తన సేవలను అందిస్తుంది."
- హర్దీప్ సింగ్ పూరి, విమానయాన మంత్రి.