తెలంగాణ

telangana

By

Published : Mar 18, 2020, 9:08 PM IST

Updated : Mar 18, 2020, 11:46 PM IST

ETV Bharat / bharat

'ఇకపై డీటీహెచ్​ ఛానెళ్లలో ఆన్​లైన్​ తరగతులు'

కరోనా వైరస్​ కారణంగా విద్యాసంస్థలను మూసివేయడం వల్ల విద్యార్థులు తరగతి గదిలో పాఠాలకు దూరమయ్యారు. వారి కోసమే మానవ వనరుల అభివృద్ధి(హెచ్​ఆర్​డీ) మంత్రిత్వ శాఖ ఆన్​లైన్ ​తరగతులు ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర హెచ్​ఆర్​డీ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

Coronavirus: HRD Ministry to launch e-classes on Swayam Prabha DTH channels for school students
'స్వయం ప్రభా డీటీహెచ్​ ఛానెల్​లో తరగతి పాఠాలు'

'ఇకపై డీటీహెచ్​ ఛానెళ్లలో ఆన్​లైన్​ తరగతులు'

కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 31వరకు విద్యాసంస్థలు మూసివేశారు. ఈ కారణంగా పిల్లలు.. చదువులకు దూరమవుతున్నారని భావించిన మానవ వనరుల అభివృద్ధి(హెచ్​ఆర్​డీ) మంత్రిత్వ శాఖ ఆన్​లైన్​ తరగతులు ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ తెలిపారు. స్వయం ప్రభ డీటీహెచ్​ ఛానెల్​లో ఆన్​లైన్​ తరగతులు అందుబాటులో ఉంటాయని ట్విట్టర్​లో వెల్లడించారు.

"విద్యార్థులారా, మీ పాఠశాలలు మూసివేసినప్పటికీ చదువును వదిలిపెట్టకండి. మీ కోసం త్వరలోనే మేం స్వయం ప్రభా డీటీహెచ్​ ఛానెళ్లలో ఆన్​లైన్​ తరగతులు ప్రారంభించనున్నాం.​ మీ పాఠశాల సిలబస్​తో కూడిన తరగతులను అందుబాటులో ఉంచుతాం. నాలుగు గంటల పాటు తరగతులు ప్రచారం చేయడానికి స్వయం ప్రభా ఛానెల్​తో అంగీకారం కుదుర్చుకున్నాం. కరోనా కారణంగా విద్యార్థులు పాఠశాలకు హాజరు కాలేకపోతున్నారు. ఈ ఖాళీ సమయాన్ని ఎక్కువగా చదువు కోసం కేటాయించండి.''

-రమేశ్​ పోఖ్రియాల్​, మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి

దేశంలో రోజురోజుకూ వైరస్​ బాధితులు పెరుగుతున్నారు. ఇప్పటికి 151మంది కొవిడ్-19 బారిన పడ్డారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:భారత్​లో 151కు చేరిన కరోనా కేసులు- అంతటా బంద్​

Last Updated : Mar 18, 2020, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details