తెలంగాణ

telangana

By

Published : Apr 6, 2020, 8:32 AM IST

ETV Bharat / bharat

కరోనా నిందలు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య

హిమాచల్​ప్రదేశ్​లో ఇరుగుపొరుగువారి అనుమానం నిండు ప్రాణాన్ని బలిగొంది. కరోనా సోకిందనే నిందలను తాళలేక ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Coronavirus: Facing 'social boycott', man hangs self to death in Himachal's Una
గ్రామస్థుల కరోనా అనుమానంతో.. ఉరేసుకుని ఆత్మహత్య

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించమని ప్రభుత్వాలు కోరుతున్న మాట నిజమే. కానీ, వైరస్​ వ్యాప్తిపై అవగాహన లేని కొందరు మాత్రం సామాజిక వివక్షకు పాల్పడుతూ ప్రాణాలు బలిగొంటున్నారు. హిమాచల్​ప్రదేశ్​లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఉనా జిల్లా బంగాఢ్​ గ్రామానికి చెందిన మహమ్మద్​ దిల్షాద్​ (37)కు కరోనా సోకిందనే అనుమానంతో గ్రామస్థులు ఆయనపై వివక్ష చూపారు. తట్టుకోలేని అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తబ్లీగీ జమాత్​కు హాజరైన ఓ వ్యక్తిని ​​ కలసినందుకు గానూ.. దిల్షాద్​కు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అయితే అతడికి కరోనా లేదని పరీక్షల్లో తేలింది. కొద్ది రోజులపాటు నిర్బంధంలో ఉంచి అతడిని ఇంటికి పంపించేశారు. కానీ, ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక గ్రామస్థుల తీరు దిల్షాద్​ను కలచివేసింది. ఇరుగుపొరుగూ ఓ అంటరానివాడిలా చూస్తూంటే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

దిల్షాద్​ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు సీఆర్​సీపీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

"కొంతమంది గ్రామస్థులు దిల్షాద్​కు కరోనా సోకిందని అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహిస్తే అతడి శరీరంలో వైరస్​ లేనట్లు నిర్ధరణ అయ్యింది. కానీ, తిరిగి ఇంటికి వెళ్లాక గ్రామస్థులు అతడి పట్ల వివక్ష చూపడం ప్రారంభించారు. దయచేసి ప్రజలు సామాజిక దూరం మాత్రమే పాటించండి.. సామాజిక వివక్ష చూపకండి"

-సీతారామ్​ మర్దీ, డీజీపీ

రెండు రోజుల క్రితం తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. కేరళ నుంచి వచ్చిన వలస కార్మికుడు ముస్తఫా కరోనా సోకిందనే నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details