తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో ముగ్గురిని బలిగొన్న కరోనా

దేశంలో కరోనా వైరస్​ వేగంగా విజృంభిస్తోంది. ఇవాళ మరో ముగ్గురు వైరస్​కు బలికాగా.. మృతుల సంఖ్య 7కు చేరింది. ఇప్పటివరకు 341 మంది వైరస్​ బారిన పడ్డారు. అత్యధికంగా మహారాష్ట్రలో 74 మందికి ఈ మహమ్మారి సోకింది.

By

Published : Mar 22, 2020, 7:04 PM IST

Coronavirus death toll rises to 7; India in lockdown mode as train, inter-state bus services stopped
దేశంలో మరో ముగ్గురిని బలితీసుకున్న కరోనా

భారత్​లో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ఆదివారం వైరస్ కారణంగా మరో ముగ్గురు మరణించగా.. మృతుల సంఖ్య 7కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 341 మందికి వైరస్​ సోకింది.

ఇవాళ మృతిచెందిన వారిలో 38 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. బిహార్‌కు చెందిన ఇతను ఇటీవలే ఖతార్‌ వెళ్లొచ్చాడు. పట్నాలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. దేశంలో వైరస్​తో మృతిచెందిన వారిలో పిన్న వయస్కుడు ఇతడే కావడం గమనార్హం.

వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో మరో మరణం సంభవించింది. 63 ఏళ్ల వ్యక్తి ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించాడు. ఒక్క మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 74కు చేరింది. గుజరాత్‌లోనూ 69 ఏళ్ల వ్యక్తి మరణించాడు.

వేర్వేరు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా...

రాష్ట్రం కేసులు మృతులు
మహారాష్ట్ర 74 2
కేరళ 52
దిల్లీ 27 1
ఉత్తర్​ప్రదేశ్ 25
తెలంగాణ 21
రాజస్థాన్​ 24
హరియాణా 17
కర్ణాటక 20 1
పంజాబ్​ 13
లద్ధాఖ్ 13 1
గుజరాత్ 14 1
తమిళనాడు 6
చండీగఢ్ 5
మధ్యప్రదేశ్ 4
జమ్ముకశ్మీర్ 4
బంగాల్ 4
ఆంధ్రప్రదేశ్ 3
ఉత్తరాఖండ్ 3
ఒడిశా 2
హిమాచల్​ప్రదేశ్​ 2
పుదుచ్చేరి​ 1
బిహార్​ - 1
ఛత్తీస్​గఢ్ 1

ABOUT THE AUTHOR

...view details