తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పూర్తి దిగ్బంధంలో భారత్- కేంద్రం కీలక ఆదేశాలు - యూపీ, మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​ ఒడిశా రాష్ట్రా

దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 548 జిల్లాల్లో పూర్తిగా లాక్​డౌన్​ విధించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రస్తుతం దేశంలో సిక్కిం, మిజోరం రాష్ట్రాల్లో మాత్రమే కరోనా నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

Coronavirus:30 states, UTs under complete lockdown
పూర్తి నిర్బంధంలోకి 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు

By

Published : Mar 23, 2020, 11:57 PM IST

కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో దేశంలోని 30 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 548 జిల్లాల్లో పూర్తిగా లాక్​డౌన్​ విధించారు. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది.

ఆదివారం వరకు దేశంలోని 80 జిల్లాల్లోనే లాక్​డౌన్​ విధించగా.. తాజాగా ఆ జాబితాను విస్తరించింది ప్రభుత్వం. భారత్​లో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుండగా 23 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి దిగ్బంధం ప్రకటించింది. మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని 58 జిల్లాల్లో మాత్రమే లాక్​డౌన్​ విధించారు. మరో కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్​​లో పాక్షికంగా సేవలు నిలిపి వేశారు. సిక్కిం, మిజోరం రాష్ట్రాల్లో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

పూర్తి నిర్బంధంలోకి 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు
పూర్తి నిర్బంధంలోకి 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు
పూర్తి నిర్బంధంలోకి 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు
పూర్తి నిర్బంధంలోకి 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు

ఇదీ చూడండి:మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా చౌహానే ఎందుకంటే?

For All Latest Updates

TAGGED:

lakdown

ABOUT THE AUTHOR

...view details