తెలంగాణ

telangana

కరోనా ఉగ్రరూపం- ఒక్కరోజే 45,720 కేసులు

By

Published : Jul 23, 2020, 9:41 AM IST

Updated : Jul 23, 2020, 11:07 AM IST

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా రికార్డు స్థాయిలో 45,720 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 1,129 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 29 వేలు దాటగా... కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది.

CORONA VIRUS DAILY UPDATES
దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా రికార్డ్​ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. దాదాపు 30 వేల మంది మృతి చెందారు.

కరోనా వివరాలు
  • మహారాష్ట్రలో ఒక్కరోజే 10,576 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,607కు చేరింది.
  • తమిళనాడులో కొత్తగా 5,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,86,492కు చేరింది.
  • దిల్లీలో కొత్తగా 1,227 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం 1,26,323 మంది వైరస్​ బారినపడ్డారు.
Last Updated : Jul 23, 2020, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details