కరోనా వైరస్ బాధితుల సంఖ్య ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో తక్కువగా కనిపించినప్పటికీ మరణాల రేటు మాత్రం అమెరికా కంటే ఎక్కువగానే ఉంటోంది. సోమవారం ఉదయం నాటికి నమోదైన లెక్కల ప్రకారం ఈ వైరస్ సోకిన వారిలో అమెరికాలో ఈ మరణాల రేటు 1.74%గా ఉండగా, భారత్లో అది 2.70%గా ఉంది. ఇది ప్రపంచ సగటు (4.69%) కంటే తక్కువే అయినప్పటికీ చాలా దేశాలతో పోలిస్తే ఇది ఎక్కువే.
సోమవారం ఉదయం 10 గంటలకు విభిన్న దేశాల్లో నమోదైన కరోనా కేసుల్లో సంభవించిన మరణాలు, కోలుకున్న వారి శాతం ఇలా...
ఇటలీ, స్పెయిన్, చైనా, ఫ్రాన్స్, ఇరాన్, బ్రిటన్, నెదర్లాండ్స్, బెల్జియంలలో మరణాల శాతం 4% నుంచి 11% వరకు నమోదైంది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ. జర్మనీలో కేసుల సంఖ్య భారీగా ఉన్నా మరణాల రేటు 0.8%కే పరిమితమైంది. ఆదివారం నాటికి భారత్లో 35వేల పరీక్షలు జరపగా అందులో 1,024 మందికి పాజిటివ్గా తేలింది. అంటే.. అనుమానిత కేసుల్లో 2.92% మందిలో ఈ వైరస్ ఉంటోంది.