తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2020, 1:11 PM IST

Updated : Apr 17, 2020, 5:13 PM IST

ETV Bharat / bharat

లాక్​డౌన్​ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్​

లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లఘించి, స్నేహితులతో కలిసి 'కరోనా విందు' చేసిన వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటన ఫేస్​బుక్​ ఫోస్ట్​లతో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

'Corona feast' lands Tamil Nadu man in trouble
లాక్​డౌవేళ సరదాగా కరోనా విందు.. ఓ వ్యక్తి అరెస్ట్​

లాక్​డౌన్​ నిబంధనలకు ప్రజలు కట్టుబడి ఉన్నా.. కొంతమంది వక్రబుద్ధి చూపిస్తున్నారు. అలాంటి ఓ వ్యక్తిపై కేసు పెట్టారు తమిళనాడు పోలీసులు. 'కరోనా విందు' పేరిట వేడుక నిర్వహించినందుకు అరెస్టు చేశారు.

ఫేస్​బుక్​ పోస్టుతో...

తంజావూరు జిల్లా కబిస్థలం గ్రామానికి చెందిన 29 ఏళ్ల శివగురు... తిరుప్పూర్​లో పనిచేసేవాడు. 2 నెలల క్రితమే స్వస్థలానికి వచ్చాడు. లాక్​డౌన్​ నేపథ్యంలో స్నేహితులందరూ ఊరిలోనే ఉండటం వల్ల సరదాగా గ్రామ శివారులో 'కరోనా విందు' పేరుతో గెట్​ టుగెదర్​ ఏర్పాటు చేశారు. రకరకాల వంటలు చేయించి అందరూ కలసి భోజనం చేశారు. అంతటితో ఆగకుండా ఫేస్​బుక్​లో ఫోస్ట్ చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామ పరిపాలనాధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శివగురును అరెస్ట్ చేశారు.

లాక్​డౌన్​ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్​

ఇదీ చూడండి:లాక్​డౌన్​ వేళ వైభవంగా మాజీ సీఎం కుమారుడి వివాహం!

Last Updated : Apr 17, 2020, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details