తెలంగాణ

telangana

దేశంలో 7 వేలు దాటిన కరోనా మరణాలు

By

Published : Jun 8, 2020, 9:49 AM IST

Updated : Jun 8, 2020, 11:56 AM IST

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య 7 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 9983 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 206 మంది ప్రాణాలు కోల్పోయారు.

CORONA TOLL IN INDIA RISES TO 7135
దేశంలో 24 గంటల్లోనే 9983 కరోనా కేసులు

భారత్​లో కొవిడ్​ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9983 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 206 మంది మరణించారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

మహారాష్ట్రలో అత్యధికంగా 3060 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 85 వేలు దాటింది. గుజరాత్​లో 1249 మంది, మధ్యప్రదేశ్​లో 412, బంగాల్​లో 396 మంది మరణించారు.

దేశంలో కరోనా వివరాలు
Last Updated : Jun 8, 2020, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details