తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో కరోనాకు మరొకరు బలి- కేసుల్లో 'మహా' టాప్​

భారత్​లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. మధ్యప్రదేశ్​ ఇండోర్​లో వైరస్ సోకి 65 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ రాష్ట్రంలో మరో 20 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 18మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 320కి చేరింది.

By

Published : Apr 1, 2020, 11:12 AM IST

Updated : Apr 1, 2020, 11:21 AM IST

corona cases
ఒక్కరోజులో 146మందికి వైరస్-దేశంలో 1238 యాక్టివ్ కేసులు

భారత్​లో కరోనా కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ ఇండోర్​లో 65 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు విడిచినట్లు అధికారులు ప్రకటించారు.

మధ్యప్రదేశ్​లో మరో 20మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఇండోర్​లో 19మందికి, ఖర్గావ్​లో ఒకరికి వ్యాధి ఉన్నట్లు తేలింది. తాజా బాధితులతో కేసుల సంఖ్య 86కు చేరింది. ఇండోర్​లో గుర్తించిన వైరస్ బాధితుల్లో 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు.

మహారాష్ట్రలో...

మహారాష్ట్రలో వైరస్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ముంబయికి చెందిన 16 మందికి, పుణె వాసులు ఇద్దరికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాజిటివ్​గా తేలినవారి సంఖ్య 320కి చేరుకుంది. రాష్ట్రంలో 12 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కారణంగా ఇప్పటివరకు 35 మంది మరణించారు. 1,238 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 123 మంది కోలుకున్నారు.

ఇదీ చూడండి:కరోనా సమర వ్యూహంలో.. వలస జీవులకు ఆసరాగా నిలవాలి

Last Updated : Apr 1, 2020, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details