తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 9,985 కేసులు, 279 మరణాలు - corona in india

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య 276,583కు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,985 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 279 మంది ప్రాణాలు కోల్పోయారు.

CORONA CASES
దేశంలో కరోనా విజృంభణ

By

Published : Jun 10, 2020, 9:32 AM IST

భారత్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 9,985 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 279 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా విజృంభణ

మహారాష్ట్రలో అత్యధికంగా 3289 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 90,787కు చేరింది. గుజరాత్​లో 1313 మంది, మధ్యప్రదేశ్​లో 420, బంగాల్​లో 415 మంది మరణించారు.

ఇదీ చూడండి: జులై ఆఖరుకు దేశంలో 10 లక్షల కేసులు

ABOUT THE AUTHOR

...view details