ఆరోగ్యమే మహాభాగ్యం... అంటున్నారు కేరళ ఎర్నాకులంలోని పోథనైక్కోడు పోలీసులు. వారి స్టేషన్ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాన్ని వ్యవసాయ భూమిగా మార్చి... పలు రకాల కూరగాయ పంటలను పండిస్తున్నారు.
రసాయన అవశేషాలు లేని ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. ఇందుకోసం వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతుల సాయం తీసుకున్నారు. బఠాణీలు, బెండకాయ, కాకరకాయ, దోసకాయ, టమాటా, మిరప, క్యాబేజి వంటి కూరగాయలు పండిస్తున్నారు.