తెలంగాణ

telangana

By

Published : Aug 28, 2019, 7:59 PM IST

Updated : Sep 28, 2019, 3:51 PM IST

ETV Bharat / bharat

బంగాల్ ముఖ్యమంత్రి కాళ్లు మొక్కిన ఐజీ

బంగాల్​ ముఖ్యమంత్రి పాదాలకు ఐజీ రాజీవ్​ కుమార్ నమస్కరించడం వివాదాస్పదమైంది. పశ్చిమ మిద్నాపుర్ జిల్లా పాలక మండలి సమావేశం సందర్భంగా జరిగిన ఈ ఘటన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్​ అయింది.

బంగాల్ ముఖ్యమంత్రి కాళ్లు మొక్కిన ఐజీ

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమం కోసం పశ్చిమ మిద్నాపుర్​ జిల్లాను సందర్శించారు. ఆ సమయంలో పోలీస్ ఐజీ రాజీవ్ మిశ్రా.. మమత కాళ్లు మెుక్కడం వివాదాస్పదమైంది.

8 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో బీచ్​ పక్కన కుర్చీపై కూర్చున్న మమత.. అక్కడున్న వారికి కేకు తినిపించారు. ఈ క్రమంలో ఐజీ రాజీవ్ వంతు వచ్చింది. కేక్​ తిన్న రాజీవ్ మమత పాదాలకు నమస్కరించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో కొద్ది క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ అధికారి ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కరించడమేంటని విమర్శలు వెల్లువెత్తాయి.

బంగాల్ ముఖ్యమంత్రి కాళ్లు మొక్కిన ఐజీ

ఈ ఘటన ఆగస్టు 21న జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోజు బంగాల్​ 'డైరక్టర్​ ఆఫ్ సెక్యూరిటీస్' వినీత్​ గోయల్​ పుట్టినరోజు. ఆ వేడుకల్లో భాగంగానే మమతా బెనర్జీ అక్కడున్నవారికి కేక్​ తినిపించారని సమాచారం.

ఇదీ చూడండి: గొప్ప ప్రదేశాల్లో ఐక్యతా విగ్రహానికి చోటుపై మోదీ హర్షం

Last Updated : Sep 28, 2019, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details