తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్యలో ఉగ్రదాడులకు భారీ కుట్ర!

అయోధ్యలో రామ మందిరానికి ఆగస్టు 5న భూమిపూజ చేయనున్నారు. అదే రోజున ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా ఉగ్రదాడులకు పాక్​ ఐఎస్​ఐ కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి.

By

Published : Jul 29, 2020, 6:55 AM IST

consperacy for terror attacks in ayodhya sorroundings
అయోధ్యలో ఉగ్రదాడులకు భారీ కుట్ర!

అయోధ్యలో భూమిపూజ రోజున రామాలయ పరిసర ప్రాంతాల్లో భారీగా ఉగ్రదాడులు జరిపేందుకు పాకిస్థాన్​ ఐఎస్​ఐ కుట్రలు పన్నుతోందని భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అయోధ్య, దిల్లీ, జమ్ముకశ్మీర్​లలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాయి.

అయోధ్యలో భూమిపూజ నిర్వహించే రోజు, జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన అధికరణం 370 ఉపసంహరణ (ఏడాది క్రితం) రోజు ఆగస్టు 5వ తేదీ కావటం వల్ల భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

ఇదీ చూడండి:'అయోధ్యలో టైమ్​ క్యాప్సుల్ వార్తలు అవాస్తవం'

ABOUT THE AUTHOR

...view details