తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​: ముందు నిరసన.. తర్వాతే బడ్జెట్​ సమావేశాలకు - Budget time protest

బడ్జెట్​ సమావేశాలను నిరసనలతో ఆరంభించనుంది కాంగ్రెస్​. సీఏఏ, ఎన్​ఆర్​సీ​లను వ్యతిరేకిస్తూ... పార్లమెంట్​ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టనుంది. సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇప్పటికే పలు వ్యూహాలను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

CONGRESS-PROTEST
కాంగ్రెస్​: ముందు నిరసన.. తర్వాతే బడ్జెట్​ సమావేశాలకు

By

Published : Jan 31, 2020, 6:49 AM IST

Updated : Feb 28, 2020, 2:55 PM IST

ఆర్థిక మందగమనం, నిరుద్యోగం వంటి సమస్యలను ఈ బడ్జెట్​ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని కాంగ్రెస్​ ప్రణాళిక రచిస్తోంది. పార్లమెంటు సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. సీఏఏ, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న వారికి మద్దతుగా నేడు​ పార్లమెంట్​ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఉదయం 10:30 గంటలకు ఆ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టనున్నారు.

ఉదయం 11 గంటలకు పార్లమెంట్​ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగానికి ముందే కాంగ్రెస్​ పార్లమెంటు ఆవరణలో నిరసన తెలపనుంది.

పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల పార్టీ బాధ్యులు, ఎంపీలతో ఫిబ్రవరి 4న కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్​డీఏ తీసుకువచ్చిన ఎన్​పీఆర్​ (జాతీయ జనాభా పట్టిక)పై పార్టీ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పాలని ఈ భేటీలో పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు.

కాంగ్రెస్​ పాలిత ప్రాంతాల్లో సహా ఇతర రాష్ట్రాల్లోనూ సీఏఏ, ఎన్​పీఆర్​లపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వీటిని తమ రాష్ట్రాల్లో అమలు చేయనివ్వబోమని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా

Last Updated : Feb 28, 2020, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details