తెలంగాణ

telangana

By

Published : Sep 15, 2020, 10:46 PM IST

ETV Bharat / bharat

'దేశ ప్రజలను మోదీ తప్పుదోవ పట్టించారు '

చైనా వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. ఈ విషయం పార్లమెంట్​లో రక్షణమంత్రి చేసిన ప్రకటన ద్వారా అర్థమవుతోందన్నారు. పార్లమెంట్​లో విపక్షాల గొంతును అణచివేసే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్​ మండిపడింది.

Congress slams Centre over India-China border tension
'ప్రజలను మోదీ మోసం చేశారు.. అదే సాక్ష్యం'

పార్లమెంట్​లో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై కాంగ్రెస్​ తీవ్ర స్థాయిలో మండిపడింది. లోక్​సభ వేదికగా సరిహద్దు ఉద్రిక్తతలపై రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రకటన చేసిన అనంతరం.. తమకు ప్రశ్నించే అవకాశాన్ని కల్పించలేదని ఆరోపించింది. విపక్షాల గొంతును అణచివేసేందుకు కుట్ర జరుగుతోందని విరుచుకుపడింది.

ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. అతి ముఖ్యమైన విషయంపై రక్షణమంత్రి ప్రకటన చేస్తున్న సమయంలో సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు లేరని ప్రశ్నించారు.

"చైనా ఆక్రమణలపై ప్రధాని మోదీ దేశప్రజలకు అబద్ధం చెప్పారు. రక్షణమంత్రి ప్రకటన ద్వారా ఇది స్పష్టంగా అర్థమవుతోంది. మన దేశ ప్రజలు జవాన్లకు ఎప్పుడూ మద్దతుగానే ఉంటారు. మరి ప్రధాని మోదీ.. మీరు చైనాకు వ్యతిరేకంగా ఎప్పుడు చర్యలు చేపడతారు? చైనా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకుంటారు?"

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

రాజ్​నాథ్​ ప్రకటన అనంతరం.. ప్రశ్నలు వేయడానికి కాంగ్రెస్​ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను అనుమతి కోరారు. అందుకు స్పీకర్​ నిరాకరించారు. వెంటనే సభ నుంచి వాకౌట్​ చేశారు కాంగ్రెస్​ ఎంపీలు.

ఇదీ చూడండి:-'భారత్‌తో కయ్యం.. చైనా అధ్యక్షుడి సీటుకు చేటు!'

ABOUT THE AUTHOR

...view details