తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'370 రద్దుతో భాజపా ఓటు బ్యాంకు రాజకీయం'

జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి తొలగింపును తీవ్రంగా తప్పుబట్టింది విపక్ష కాంగ్రెస్. భాజపా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్ర ఐక్యత, సమగ్రతతో ఆటలాడుతోందని మండిపడింది.

By

Published : Aug 5, 2019, 2:58 PM IST

Updated : Aug 5, 2019, 3:10 PM IST

'370 రద్దుతో భాజపా ఓటు బ్యాంకు రాజకీయం'

జమ్ముకశ్మీర్​ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అన్ని రకాలుగా భిన్నమైన ప్రజలు నివసిస్తున్న జమ్ముకశ్మీర్​ను రెండు ప్రాంతాలుగా విడగొట్టిన ఈ రోజు భారత చరిత్రలో చీకటి రోజని వ్యాఖ్యానించింది.

కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే రాష్ట్ర ఐక్యత, సమగ్రతలతో కేంద్రం ఆడుకుంటోందని ఆరోపించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్.

'370 రద్దుతో భాజపా ఓటు బ్యాంకు రాజకీయం'

"స్వతంత్ర భారతంలో పార్లమెంట్ ఒక ఊహించని అడుగు వేసింది. జమ్ముకశ్మీర్ భారత్​తో కలవడం వెనక ఒక చరిత్ర ఉంది. భారత్​తో కలిసి ఉండే క్రమంలో ఎంతోమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, సైన్యం, పోలీసులు తమ ప్రాణాలను అర్పించారు. వీరి త్యాగాలతో జమ్ముకశ్మీర్​ భారత్​తో కలసి ఉంది. ఎప్పుడైనా ఉగ్రవాద దాడులు జరిగితే వాటిని పౌర సమాజం, రాజకీయ పార్టీలు, సైన్యం సమర్థంగా ఎదుర్కొన్నాయి.

భాజపా సర్కారు... అధికారం, ఓట్లు సంపాదించడం కోసం సాంస్కృతికంగా, భౌగోళికంగా, చారిత్రకంగా, రాజకీయంగా భిన్నమైన సరిహద్దు రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేసింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో లద్దాఖ్​లో ఎక్కువగా ముస్లింలు ఉంటారు. కశ్మీర్​లో పండిత్​లు, ముస్లింలు, సిక్కులు.... జమ్ములో 60 శాతం హిందువులు-40 శాతం ముస్లిములు నివసిస్తున్నారు. వీరందరిని కలిపి ఉంచిన అంశం ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్​లో మూడు ప్రాంతాలకు సంబంధించిన అంశాలున్నాయి. కానీ భాజపా ఒకే ఒక్క కలం పోటుతో 3, 4 అంశాలను రద్దు చేసింది. భారత చరిత్రలో ఇది చీకటి రోజుగా మిగిలిపోతుంది."

-గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత.

ఇవీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: ఆర్టికల్​ 370 అంటే ఏంటి?

ఆపరేషన్​ కశ్మీర్​: ఏంటీ ఆర్టికల్​ 35-ఎ?

Last Updated : Aug 5, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details