కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు రిజర్వేషన్, ఉచిత ప్రయాణం! హరియాణా శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఓటర్లపై హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్. 'సంకల్ప్ పత్ర' పేరిట మేనిఫెస్టోను ఛండీగఢ్లో విడుదల చేసింది. మహిళలకు 33% రిజర్వేషన్, రైతు రుణమాఫీ ప్రధాన అజెండాగా ప్రకటించి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసింది. మహిళలకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. భాజపా ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై ప్రత్యేక దర్యాప్తు చేయిస్తామని హరియాణా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారీ సెల్జా ప్రకటించారు.
'సంకల్ప్ పత్ర'లో ముఖ్యాంశాలు
- మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 33% రిజర్వేషన్. బస్సుల్లో ఉచిత ప్రయాణం.
- మహిళలకు పంచాయతీ రాజ్, మున్సిపల్ కార్పొరేషన్, మండలిలో 50% రిజర్వేషన్.
- రైతు రుణమాఫీ
- ఎస్సీ, వెనుక బడిన వర్గాల విద్యార్థులకు వార్షిక ఉపకారవేతనాలు. ఒకటి నుంచి పదో తరగతి చదివే బాలబాలికలకు 12 వేల రూపాయలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు 15 వేల రూపాయలు ఉపకార వేతనం.
ఇదీ చూడండి:'మహా'పోరు: కాంగ్రెస్కు 'దేశ్ముఖ్'లు దారి చూపుతారా?