తెలంగాణ

telangana

By

Published : Nov 21, 2019, 5:13 AM IST

Updated : Nov 21, 2019, 8:08 AM IST

ETV Bharat / bharat

కీలక భేటీలతో ముగింపు దశకు మహా ప్రతిష్టంభన!

నేడు కాంగ్రెస్​-ఎన్​సీపీ మధ్య కీలక భేటీ జరగనుంది. మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఇరుపార్టీలు చర్చించనున్నాయి. అనంతరం రేపు శివసేనతో ఇరు పార్టీల నేతల సమావేశం కానున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే అంశంపై సర్వత్రా అసక్తి నెలకొంది.

కీలక భేటీలతో ముగింపు దశకు మహా ప్రతిష్టంభన!

కీలక భేటీలతో ముగింపు దశకు మహా ప్రతిష్టంభన!

మహా ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన అడుగులు వేస్తున్నాయి. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత పృథ్వీరాజ్​ చౌహాన్​ తెలిపారు.

మహా రాజకీయాలపై చర్చించడానికి నేడు కాంగ్రెస్​-ఎన్​సీపీ నేతలు సమావేశంకానున్నారని వెల్లడించారు చౌహాన్​. అనంతరం రేపు ఇరువర్గాలు.. శివసేన నేతలతో భేటీ అవుతాయని స్పష్టం చేశారు. మరోవైపు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే అధ్యక్షతన ఆ పార్టీ నేతలు రేపు భేటీకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్​ కార్యాచరణపై ప్రసంగించనున్నారు ఉద్ధవ్​. ఈ రెండు సమావేశాల అనంతరం సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కీలక ప్రకటన వెలువడే అవకాశముంది.

సీఎం ఎవరు?

కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైన వేళ.. ముఖ్యమంత్రి పీఠంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం కుర్చీ కోసమే మిత్రపక్షమైన భాజపాతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్​-ఎన్​సీపీ కూటమితో చేతులు కలిపింది సేన.

అయితే.. ముఖ్యమంత్రి పదవి కోసం రొటేషన్​ పద్ధతిని అనుసరించే అవకాశముంది. తొలి రెండున్నరేళ్లు శివసేన, చివరి రెండున్నరేళ్లు ఎన్​సీపీ సీఎం కూర్చీని పంచుకునే అవకాశముందని సమాచారం. కాంగ్రెస్​ మాత్రం డిప్యూటీ సీఎం పదవిలోనే ఐదేళ్లు కొనసాగుతుందని తెలుస్తోంది.

అయితే... బుధవారం జరిగిన సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించలేదని కాంగ్రెస్​ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి:- చంద్రయాన్-2: '500మీ. దూరంలో అలా జరిగిపోయింది'

Last Updated : Nov 21, 2019, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details