తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చమురు ఆగ్రహం: కాంగ్రెస్​ దేశవ్యాప్త నిరసనలు

By

Published : Jun 29, 2020, 11:12 AM IST

Updated : Jun 29, 2020, 12:25 PM IST

CONGRESS NATIONWIDE PROTEST ON FUEL PRICES
చమురు ఆగ్రహం: కాంగ్రెస్​ దేశవ్యాప్త నిరసనలు

12:24 June 29

ద్విచక్రవాహనాలు తోస్తూ.. ఆందోళన

కరోనా సంక్షోభ సమయంలో పెట్రోల్​ ధరలు పెంచటంపై మహారాష్ట్రలోని పలు నగరాల్లో కాంగ్రెస్​ ఆందోళనలు చేపట్టింది. పుణెలో చేపట్టిన ధర్నాలో కాంగ్రెస్​ నేతలతో పాటు రాష్ట్ర మంత్రి బాలాసాహేబ్​ థోరట్​ పాల్గొన్నారు. రోడ్లపై ద్విచక్రవాహనాలను తోసుకుంటూ వేళుతూ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్​ చేశారు. 

11:35 June 29

గుజరాత్​లో అరెస్ట్​ల పర్వం..

చమురు ధరల పెరుగుదలను నిరసిస్తూ.. ఆందోళనకు దిగారు కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు. రహదారులను నిర్బంధిస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్​ స్టేషన్లకు తరలించారు అహ్మదాబాద్​ పోలీసులు. 

11:32 June 29

ఎండ్ల బండ్లతో నిరసన..

పెట్రోల్​ ధరల పెంపునకు నిరసనగా బిహార్​ రాజధాని పట్నా సహా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్​ నేతలు ఎడ్లు, గుర్రపు బండ్లతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కొందరు నేతలు, కార్యకర్తలు సైకిళ్లు, రిక్షాలతో ధర్నా ప్రాంతాలకు చేరుకుని నిరనసన వ్యక్తం చేశారు.  

11:14 June 29

కర్ణాటకలో...

చమురు ధరల పెంపును నిరసిస్తూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య.. కార్యకర్తలతో కలసి ఆయన నివాసం వద్ద సైకిల్​ తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. 

11:03 June 29

చమురు ఆగ్రహం: కాంగ్రెస్​ దేశవ్యాప్త నిరసనలు

పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపును నిరసిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్​ చేస్తూ దిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ దోపిడీని ఎండగట్టటమే ఆందోళనల లక్ష్యమని కాంగ్రెస్​ నేతలు పేర్కొన్నారు.

Last Updated : Jun 29, 2020, 12:25 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details