తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తిహార్​ జైలుకు సోనియా గాంధీ, మన్మోహన్​ - P Chidambaram

తిహార్​ జైలులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని కలిశారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రికి మద్దతు తెలిపారు.

తిహార్​ జైలుకు సోనియా, మన్మోహన్​!

By

Published : Sep 23, 2019, 9:53 AM IST

Updated : Oct 1, 2019, 4:13 PM IST

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్‌ జైలులో జుడిషీయల్‌ రిమాండ్‌లో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశమయ్యారు.

సెప్టెంబర్ 5 నుంచి తిహార్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు చిదంబరం. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో చిదంబరానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. గత వారం కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ చిదంబరాన్ని కలిసి సంఘీభావం ప్రకటించారు. నేడు సోనియా, మన్మోహన్‌ మద్దతు తెలిపారు.

చిదంబరంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని హస్తం పార్టీ కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది.

ఇదీ చూడండి:గాంధీ 150: బాపూను వైఫల్యం పలకరించిన క్షణం!

Last Updated : Oct 1, 2019, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details