తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జీఎస్టీ 2.ఓ కచ్చితంగా తెస్తాం : రాహుల్​ గాంధీ

తమ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్టీని కచ్చితంగా సరళతరం చేస్తామని స్పష్టం చేశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. నోట్ల రద్దు, సంక్టిష్ట జీఎస్టీ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. '

By

Published : Apr 26, 2019, 5:22 AM IST

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ

భాజపా ప్రభుత్వం తెచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ), నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిందని, కోట్లాది ఉద్యోగాలు నాశనమయ్యాయని ఆరోపించారు రాహుల్​ గాంధీ. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే పన్ను స్లాబు ఉండే సరళతర జీఎస్టీని తీసుకొస్తామని స్పష్టం చేశారు.

'జీఎస్టీ 2.ఓ'పై వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు రాహుల్​ గాంధీ. ప్రస్తుతం అమలవుతున్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వల్ల చిన్న వ్యాపారులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ వీడియోలో పొందుపరిచారు. అలాగే కాంగ్రెస్​ జీఎస్టీని ఎలా సరళతరం చేస్తుందో వివరించారు.

జీఎస్టీని గబ్బర్​సింగ్​ ట్యాక్స్​గా అభివర్ణించారు రాహుల్​.

" గబ్బర్​సింగ్​ ట్యాక్స్​, నోట్ల రద్దు కోట్లాది ఉద్యోగాలను నాశనం చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించాయి. ఒకే పన్ను ఉండే సరళతర జీఎస్టీ 2.ఓను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్​ పార్టీ కట్టుబడి ఉంది." -- రాహుల్​ గాంధీ ట్వీట్

వీడియోలో షోలే పాత్రల ప్రస్తావన

రాహుల్​ గాంధీ ట్వీట్​ చేసిన వీడియోలో షోలే చిత్రంలోని పాత్రల ప్రస్తావన ఉంది. జీఎస్టీని గబ్బర్​ సింగ్​ ట్యాక్స్​గా పోల్చారు. గబ్బర్​ పాత్రను ఆ సినిమాలో అంజాద్​ ఖాన్​ పోషించారు. విలనిజానికి ఆ పాత్ర ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రస్తుత కఠినతర జీఎస్టీ తొలగించి... కాంగ్రెస్​ ఏ విధంగా సరళం చేస్తుందనేదే ఆ వీడియో సారాంశం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details