తెలంగాణ

telangana

కాంగ్రెస్​ సభలో మోదీకి జై- డిగ్గీకి ఝలక్​

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు దిగ్విజయ్​ సింగ్​కు భోపాల్​ ప్రచార సభలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ముందే ఓ యువకుడు మోదీని ప్రశంసించాడు. వెంటనే తేరుకున్న నాయకులు ఆ వ్యక్తిని వేదికపై నుంచి కిందకు దింపారు.

By

Published : Apr 22, 2019, 6:36 PM IST

Published : Apr 22, 2019, 6:36 PM IST

కాంగ్రెస్​ సభలో మోదీకి జై- డిగ్గీకి ఝలక్​

కాంగ్రెస్​ సభలో మోదీకి జై- డిగ్గీకి ఝలక్​

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, భోపాల్​ లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థి దిగ్విజయ్​ సింగ్​కు ఎన్నికల ప్రచారంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆయన సమక్షంలోనే మోదీపై ప్రశంసల జల్లు కురిపించాడో యువకుడు.

2014 ఎన్నికల సమయంలో చెప్పినట్లు మోదీ రూ.15 లక్షలు మీ ఖాతాలో వేశారా అని ప్రశ్నించారు దిగ్విజయ్​. సభకు హాజరైన వారిలో ఓ యువకుడు లేచి నిల్చున్నాడు. నీ ఖాతాలో డబ్బు వేశారా... అయితే ఖాతా నంబర్​ చెప్పు అని అడిగారు. వేదికపైకి పిలిచారు.

యువకుడు వేదికపైకి వచ్చి భాజపాపై విమర్శలు చేస్తాడని అంతా భావించారు. అనూహ్యంగా అతడు "మోదీ మెరుపుదాడులు చేశారు, ఉగ్రవాదులను చంపారు" అని పొగిడాడు.

ఈ వ్యాఖ్యలతో దిగ్విజయ్​ సహా కాంగ్రెస్​ నేతలు ఖంగుతిన్నారు. వెంటనే తేరుకుని ఆ యువకుడ్ని వేదికపై నుంచి దించేశారు.

ఇదీ చూడండీ:'మోదీ... దమ్ముంటే అవినీతిపై చర్చకు రండి'

ABOUT THE AUTHOR

...view details