నేడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నా... కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ లోక్సభ పక్షనేతను ప్రకటించలేదు. ఈ బాధ్యతలు పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ చేపడతారా, మరో నేతకు అప్పగిస్తారా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు.
16వ లోక్సభలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే తాజా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఖర్గే ఓటమి, లోక్సభ పక్షనేత ఎన్నికపై రాహుల్ మౌనం ఫలితంగా మరో నేతను పార్టీ ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ ప్రస్తుతం లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్ పట్టుబడుతున్నారు. రాహుల్ నిష్క్రమణను పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ పక్షనేతగా రాహుల్గాంధీయే బాధ్యతలు చేపడతారా? లేదా మరొకరికి అప్పగిస్తారా? అన్నదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.
బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి, కేరళకు చెందిన కె.సురేశ్లో ఒకరిని కాంగ్రెస్ లోక్సభ పక్షనేతగా ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు శశిథరూర్, మనీశ్ తివారీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
విధేయులకే అవకాశమా..?