తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు కాంగ్రెస్​ ఎన్నికల ప్రణాళిక విడుదల - దిల్లీ

కాంగ్రెస్​ పార్టీ నేడు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్​ గాంధీ సహా ముఖ్యనేతలు మేనిఫెస్టోలోని అంశాలను ప్రకటించనున్నారు.

కాంగ్రెస్​

By

Published : Apr 2, 2019, 6:13 AM IST

Updated : Apr 2, 2019, 6:49 AM IST

కాంగ్రెస్​ లోక్​సభ మేనిఫెస్టో విడుదల నేడే
లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్​ పార్టీ నేడు విడుదల చేయనుంది. పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్​ గాంధీ సహా మాజీ ప్రధాని మన్మోహన్​ తదితర ముఖ్యనేతలు మేనిఫెస్టోలోని అంశాలను వెల్లడించనున్నారు. దిల్లీ అక్బర్​ రోడ్​లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం జరగనుంది.

మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుందని ఇటీవలే ప్రకటించారు రాహుల్​ గాంధీ. ఉద్యోగాల కల్పన, విద్య, వైద్య వ్యవస్థల బలోపేతం, ఆర్థికవృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలతో మేనిఫెస్టో తయారు చేస్తామని చెప్పారు. కనీస ఆదాయ పథకం ఎన్నికల ప్రణాళికలో ముఖ్యాంశంగా ఉండనుంది.

దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది రాజకీయ నేతలు, వివిధ వర్గాల ప్రజలను సంప్రదించి, అందరి సలహాలు సూచనల మేరకు మేనిఫెస్టోను తయారు చేసింది పార్టీ ఎన్నికల ప్రణాళిక కమిటీ. పార్టీ మేనిఫెస్టో కమిటీకి మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అధ్యక్షత వహించారు.

Last Updated : Apr 2, 2019, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details