తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీజీ.. చైనాపై కన్నెర్ర చేసేదెప్పుడు?' - కాంగ్రెస్

సరిహద్దులో చైనా దూకుడు నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేసింది. చైనా సైన్యం ప్రతి రోజు చొరబాట్లకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. చైనాపై మోదీ ఇంకెప్పుడు కన్నెర్ర చేస్తారని ప్రశ్నించింది.

Cong slams govt over Chinese aggression at border
'మోదీజీ.. చైనాపై కన్నెర్రజేసేదెప్పుడు?'

By

Published : Aug 31, 2020, 4:09 PM IST

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా మరోసారి దూకుడు ప్రదర్శించిన నేపథ్యంలో మోదీ సర్కార్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేసింది కాంగ్రెస్. ప్రతి రోజు చైనా సైన్యం భారత్​లోకి చొరబాటు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించింది. చైనాపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు కన్నెర్రజేస్తారని ప్రశ్నించింది.

"పాంగాంగ్​ సో సరస్సు వద్ద చైనా సైన్యం మరోసారి దుందుడుకు చర్యకు దిగింది. పాంగాంగ్ సో, గోగ్రా, గల్వాన్ లోయ, దెస్పంగ్, లిపులేఖ్, దోకా లా, నకులా పాస్​ ప్రాంతాల్లో నిత్యం చైనా చొరబాట్లకు పాల్పడుతోంది. మన భద్రతా దళాలు భరతమాతను రక్షించేందుకు ధైర్యంగా నిలబడుతున్నాయి. కానీ, మోదీ కన్నెర్రజేసేది ఎప్పుడు?"

-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

కాంగ్రెస్ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ సైతం కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎల్​ఏసీ వెంట యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నిస్తూనే ఉందని అన్నారు. కానీ వాస్తవ పరిస్థితిని ఒప్పుకునేందుకు కూడా భాజపా ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని దుయ్యబట్టారు.

సరిహద్దులో భారత సైన్యాన్ని రెచ్చగొట్టేందుకు చైనా యత్నించిందని అధికార వర్గాలు తెలిపాయి. చైనా కుట్రలను ముందుగానే పసిగట్టిన మన బలగాలు వారి దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టినట్లు వెల్లడించాయి. ఆగస్టు 29-30 మధ్యరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిపాయి.

ఇదీ చదవండి-హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్​

ABOUT THE AUTHOR

...view details