తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీతో వచ్చిన నల్ల పెట్టెలో ఏముంది?' - helicopter

కర్ణాటక చిత్రదుర్గలో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో మోదీ ప్రయాణించిన హెలికాప్టర్​ నుంచి బయటకు ఓ నల్లపెట్టెను తరలించారని కాంగ్రెస్​ చెబుతోంది. అందులో ఏముందో విచారణ చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్​ చేస్తోంది.

చిత్రదుర్గ సభ

By

Published : Apr 14, 2019, 5:02 PM IST

ఆనంద్​ శర్మ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి పర్యటనపై కాంగ్రెస్ అనుమానాలను లేవనెత్తింది. నరేంద్రమోదీ వచ్చిన హెలికాప్టర్​ నుంచి తరలించిన నల్లపెట్టెలో ఏముందో చెప్పాలని ఆ పార్టీ డిమాండ్​ చేసింది. ఇలాంటి విషయాల్లో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ కోరారు.

"చిత్రదుర్గలో ప్రధానమంత్రి హెలికాప్టర్​ నుంచి ఓ పెద్ద నల్లపెట్టెను దించారు. ఈ పెట్టెను ప్రధాని వాహన శ్రేణిలో లేని ఓ ప్రైవేట్​ వాహనంలో పెట్టారు. వెంటనే అక్కడ నుంచి వేగంగా ఆ కారు వెళ్లిపోయింది. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఆ దృశ్యాలు మాకు చూపించారు. కర్ణాటక పార్టీ అధ్యక్షుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది."

- ఆనంద్ శర్మ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

చిత్రదుర్గకు ఈ నెల 12న మోదీ వచ్చినప్పుడు ఓ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను కాంగ్రెస్ నేతలు బహిర్గతం చేశారు. ప్రధాని వచ్చిన హెలికాప్టర్​ నుంచి ఓ నల్లపెట్టెను నలుగురు తీసుకెళ్లి మరో వాహనంలో పెడతారు. వెంటనే ఆ వాహనం అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోవడం ఆ దృశ్యాల్లో ఉంది.

ఇదీ చూడండి: ఎక్కువ మంది నేరచరితులు, కోటీశ్వరులే

ABOUT THE AUTHOR

...view details