తెలంగాణ

telangana

ప్రగ్యా​పై కఠిన చర్యల కోసం కాంగ్రెస్​ ప్రయత్నాలు

భాజపా ఎంపీ ప్రగ్యా సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చర్యలకు సిద్ధమవుతోంది. సభలోనుంచి బహిష్కరించే విధంగా ప్రగ్యాపై సెన్సూర్​​ మోషన్​ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. సభలోకి తిరిగి తీసుకునే ముందు క్షమాపణలు చెప్పాలని తీర్మానంలో డిమాండ్ చేస్తున్నారు.

By

Published : Nov 28, 2019, 6:14 PM IST

Published : Nov 28, 2019, 6:14 PM IST

Cong, other UPA constituents to move censure motion in LS against Pragya Thakur
ప్రగ్యా​పై కఠిన చర్యల కోసం కాంగ్రెస్​ ప్రయత్నాలు

మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే దేశభక్తుడంటూ వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ ప్రగ్యా ఠాకూర్​పై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఆమెను పార్లమెంట్​నుంచి బహిష్కరించే ఉద్దేశంతో సెన్సూర్​ మోషన్​ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించడానికి కాంగ్రెస్ ఎంపీలతో పాటు, మిత్రపక్షాలైన డీఎంకే, ఎన్​సీపీ, ఆర్​జేడీ పార్టీల సభ్యుల సంతకాలను తీసుకున్నట్లు సమాచారం.

లోక్​సభ వేదికగా జాతిపిత మహాత్మా గాంధీని అవమానించినందుకు ప్రగ్యా సింగ్ ఠాకూర్​పై సెన్సూర్​ తీర్మానానికి సభ ప్రతిపాదించింది. సదరు సభ్యురాలిని సభలో నుంచి తప్పుకోవాలని కోరుతున్నాం. తిరిగి సభలోకి చేర్చుకునే ముందు అధికారికంగా క్షమాపణలు చెప్పాలి.
-యూపీఏ ప్రతిపాదిత తీర్మానం.

కాంగ్రెస్​ను ఉగ్రవాద పార్టీగా ప్రగ్యా అభివర్ణించిన నేపథ్యంలో ఆ పార్టీ కఠిన చర్యలకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. సభ మర్యాదల్ని మంటగలుపుతూ ఇలాంటి అవసరంలేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

గాడ్సేను బుధవారం లోక్​సభలో దేశభక్తుడిగా అభివర్ణించారు ప్రగ్యా. దీనిపై రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది. క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details