తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2019, 11:26 PM IST

ETV Bharat / bharat

'బళ్లారి భూ అమ్మకాల్లో అధికార కూటమికి ముడుపులు'

కర్ణాటకలోని అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమిపై భాజపా సీనియర్ నేత యడ్యూరప్ప తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. జేఎస్​డబ్ల్యూ స్టీల్​కు బళ్లారిలో ఇనుప ఖనిజం భూములను చవకగా అమ్మడంలో అధికార కూటమికి ముడుపులు అందాయని ఆరోపించారు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప.

'బళ్లారి భూఅమ్మకాల్లో అధికార కూటమికి ముడుపులు'

కర్ణాటక అధికార కూటమిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది భాజపా. ఇనుప ఖనిజం తవ్వేందుకు జేఎస్​డబ్ల్యూ స్టీల్​ సంస్థకు బళ్లారిలో 3667 ఎకరాల భూములను చవకగా అమ్మడంలో అధికార కూటమికి ముడుపులు ముట్టాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత యడ్యూరప్ప ఆరోపించారు. ఇనుప ఖనిజం భూములను జేఎస్​డబ్ల్యూకు అమ్మటాన్ని నిరసిస్తూ మూడు రోజుల పాటు బెంగళూరులో నిరసనలు చేపట్టనున్నామని ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనట్లయితే రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.

తాము ఇనుప ఖనిజ గనులను కొనుగోలు చేయడంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్న జేఎస్​డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ వ్యాఖ్యల నేపథ్యంలో యడ్యూరప్ప ఈ ప్రకటన చేశారు. బళ్లారిలోని ఇనుప ఖనిజం ఉన్న భూముల లీజును రద్దు చేస్తూ తక్కువ ధరకు అమ్మేందుకే కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఎడ్డీ ఆరోపించారు.

ఇదీ చూడండి: సుఖోయ్​ యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్​

ABOUT THE AUTHOR

...view details