తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"దక్షిణాది నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలి" - ఉమెన్​ చాండీ

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ దక్షిణ భారతం నుంచి పోటీ చేయాలని కేరళ కాంగ్రెస్​ విజ్ఞప్తి చేసింది. కేరళ వయనాడ్​​ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకులు కోరారు. ఈ ప్రతిపాదనపై రాహుల్ గాంధీ​ స్పందించలేదు.

దక్షిణాది నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలి

By

Published : Mar 23, 2019, 10:17 PM IST

ఉమెన్​ చాండీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
దక్షిణ భారతంలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పోటీ చేయాలని కేరళ రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీ ఆకాంక్షిస్తోంది. కేరళలోని వయనాడ్ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు ఆ పార్టీ నాయకులు. రాష్ట్ర నాయకుల వినతిపై రాహుల్​ స్పందించనప్పటికీ , సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి రాహుల్​ గాంధీ పోటీ చేస్తే దక్షిణ భారత్​లో పార్టీ మరింత బలోపేతమవుతుందనేది వారి నమ్మకం.

దక్షిణ భారతంలోని ఏదో ఒక స్థానం నుంచి రాహుల్​ పోటీ చేయాలని పార్టీ నాయకులు డిమాండ్​ చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాండీ తెలిపారు.

" కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ దక్షిణ భారత్​ నుంచి అందులో వయనాడ్​​ స్థానంలో పోటీ చేయాలని కోరాం. మా వినతిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ సానుకూల స్పందన ఉందని మేము భావిస్తున్నాం. "- ఉమెన్​ చాండీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.

కేరళలోని 20 లోక్​సభ స్థానాల్లో కాంగ్రెస్​ పార్టీ 16 సీట్లలో పోటీ చేస్తోంది. ఇప్పటికే 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వయనాడ్​​, వడకర స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.

కేరళలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించడానికి రాహుల్​ వచ్చిన సందర్భంలో వయనాడ్​​ నుంచి పోటీ చేయాలని కోరినట్లు రాష్ట్ర ప్రతిపక్ష నేత రమేష్​ చెన్నితల తెలిపారు. దక్షిణ భారత్​, ఉత్తర భారత్​లో రాహుల్​ పోటీ చేస్తే జాతీయ ఐక్యత బలోపేతమవుతుందని తెలిపారు.

తమిళనాడు, కర్ణాటక కాంగ్రెస్​ పార్టీలు సైతం ఆయా రాష్ట్రాల్లో రాహుల్​ గాంధీ పోటీ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. రాహుల్​ గాంధీ తన కంచుకోట అమేఠీ నుంచి బరిలో ఉంటున్నారని ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్.​

ABOUT THE AUTHOR

...view details