బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సమన్వయం, ప్రచారం సహా వివిధ అంశాలపై కమిటీలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్. వీటిలో కీలకమైన ఎన్నికల నిర్వహణ, సమన్వయ కమిటీ ఛైర్మన్గా పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సుర్జేవాలాను నియమించింది అధిష్ఠానం.
14 మంది సభ్యులుగా గల ఈ కమిటీకి కన్వీనర్గా పార్టీ ప్రతినిధుల్లో ఒకరైన మోహన్ ప్రకాశ్ను నియమించింది కాంగ్రెస్. మీరా కుమార్, తారిఖ్ అన్వర్, శత్రుఘ్న సిన్హా, కీర్తి ఆజాద్, షకీల్ అహ్మద్, సంజయ్ నిరుపమ్ వంటి పార్టీ సీనియర్ నాయకులకు ఇందులో చోటు దక్కింది.