తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మధ్యప్రదేశ్​లో కమల్​నాథ్​ ఒక్కరే సింహం'

మధ్యప్రదేశ్​లో ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ఒక్కరే 'సింహం' అని పేర్కొంది అధికార కాంగ్రెస్​ పార్టీ. ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలికిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చౌహాన్​ గతంలో పేర్కొన్న 'పులి ఇంకా బతికే ఉంది' అనే వ్యాఖ్యలకు కౌంటర్​ ఇచ్చింది హస్తం పార్టీ.

By

Published : Jul 28, 2019, 4:51 AM IST

Updated : Jul 28, 2019, 7:58 AM IST

'మధ్యప్రదేశ్​లో కమల్​నాథ్​ ఒక్కరే సింహం'

'మధ్యప్రదేశ్​లో కమల్​నాథ్​ ఒక్కరే సింహం'

మధ్యప్రదేశ్​లో అధికార కాంగ్రెస్​, ప్రతిపక్ష భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలికిన నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ఒక్కరే సింహం అంటూ పేర్కొన్నారు పట్టణ పాలక వ్యవహారాల మంత్రి జయవర్ధన్​ సింగ్​. డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమి పాలైన క్రమంలో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ 'పులి ఇంకా బతికే ఉంది' అంటూ వ్యాఖ్యానించటంపై కౌంటర్​ ఇచ్చింది కాంగ్రెస్​.

జులై 24న అసెంబ్లీలో శిక్షాస్మృతి​ చట్ట సవరణ బిల్లు -2019కు మద్దతుగా భాజపా ఎమ్మెల్యేలు శరద్​ కోల్​, నారాయణ్​ త్రిపాఠి ఓటు వేశారు. ఈ చర్యతో ప్రతిపక్ష భాజపా ఆశ్యర్యానికి గురయింది. ఆటను కాంగ్రెస్సే ప్రారంభించిందని, కానీ ముగింపు తాము ఇస్తామని భాజపా నేత నరోత్తమ్​ మిశ్రా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించారు జయవర్ధన్​.

" భాజపా శ్రేణులు కావాలంటే కలలు కనవచ్చు. కానీ మధ్యప్రదేశ్​లో తాను ఒక్కరే సింహమని కమల్​నాథ్​ నిరూపించుకున్నారు. కమల్​నాథ్​ నాయకత్వంపై నమ్మకంతోనే ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు కాంగ్రెస్​తో కలిసి నడవాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రి పనితీరుకు ఆకర్షితులై మాకు మద్దతు పలికారు. "

- జయవర్ధన్​ సింగ్​, పట్టణ పాలక వ్యవహారాల మంత్రి.

ఇదీ చూడండి: 'చావు బతుకులు లెక్క చేయని జవాన్లే హీరోలు'

Last Updated : Jul 28, 2019, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details