తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాకు కాంగ్రెస్​ '7 తీర్మానాల' సూచన - LATEST BJP NEWS

నూతన ఏడాది సందర్భంగా కమల దళానికి 7 తీర్మానాలు సూచించింది హస్తం పార్టీ. ప్రజాస్వామ్య సూత్రాలను పాటించడం, నిజాలు మాట్లాడటం వంటి తీర్మానాలను భాజపా కచ్చితంగా అనుసరించాలంది. ఈ తీర్మానాలు పాటించడంలో సహాయం చేయడమే ఈ ఏడాది ప్రభుత్వానికి తాము ఇచ్చే బహుమతని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

Cong asks BJP to adopt seven New Year resolutions like being more democratic
భాజపా- కాంగ్రెస్​ '7 తీర్మానాల' కథ

By

Published : Jan 3, 2020, 6:01 AM IST

Updated : Jan 3, 2020, 12:28 PM IST

భాజపాకు కాంగ్రెస్​ '7 తీర్మానాల' సూచన

అధికార భాజపా విధానాలను నిత్యం విమర్శించే కాంగ్రెస్​.. నూతన ఏడాదిని పురస్కరించుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ కొత్త ఏడాదిలో భాజపా 7 తీర్మానాలు పెట్టుకుని, వాటిని అములు చేయడానికి కృషి చేయాలని సూచించింది.

ప్రజాస్వామ్య సూత్రాలను పాటించడం, పురాతన కాలంనాటి విధానాలకు స్వస్తి చెప్పడం, సత్యం పలకడం, ప్రచారాలపై వినియోగించే ఖర్చులు తగ్గించడం, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం-ఇతరులనూ ఆస్వాందించేలా ప్రోత్సహించడం, రాజ్యాంగాన్ని చదవడం, విదేశీ పర్యటనలను తగ్గించి స్వదేశంలో ఎక్కువ సమయం గడపటం వంటి 7 తీర్మానాలు కాషాయ పార్టీ అనుసరించాలంటూ ట్వీట్​ చేసింది. అంతేకాకుండా.. ఈ 7 తీర్మానాలను కఠినంగా పాటించడంలో సహాయం చేయడమే ఈ ఏడాది తాము ప్రభుత్వానికిచ్చే బహుమతని తెలిపింది.

"చాలా మంది సాధారణంగా వారి తీర్మానాలకు కట్టుబడి ఉండలేరు. కాని మెరుగైన ప్రజాస్వామ్య పాలన కోసం.. ఈ తీర్మానాలకు కట్టుబడి ఉండాలని మేము భాజపాను సూచిస్తున్నాం."

---కాంగ్రెస్​.

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం దేశంలోని ప్రధాన నగరాల్లో 144 సెక్షన్​ విధించడం, ఎన్​ఆర్​సీ, సీఏఏ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన శాంతియుత నిరసనలపై బలగాలను ప్రయోగించడం వల్ల భాజపాకు ప్రజాస్వామ్య విలువల పట్ల చిన్నచూపు ఉన్నట్టు ఆరోపించింది కాంగ్రెస్​. అందుకే మొదటిగా ప్రజాస్వామ్య సూత్రాలు పాటించాలనే తీర్మానాన్ని సూచించినట్టు స్పష్టం చేసింది.

ప్రధాని విదేశీ పర్యటనలపై కాంగ్రెస్​ అనేకమార్లు మండిపడింది. అందుకే "మోదీ భారత్​లో ఎక్కువగా ఉండండి" అంటూ విమర్శనాస్త్రాలు సంధించింది. పర్యటనలపై కాకుండా ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి సారించాలని సలహా ఇచ్చింది.

పాత కాలం నాటి విధానాలు, ఆలోచనలనే కమలనాధులు ఇప్పటికీ అనుసరిస్తున్నారని విమర్శించింది కాంగ్రెస్​. మహిళా రిజర్వేషన్​ బిల్లును భాజపా అమలు చేయకపోవడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ఉత్తర్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ అదిత్యానాథ్​ బిల్లును వ్యతిరేకించడాన్ని గుర్తిచేసింది.

నిర్బంధ కేంద్రాలు, ఎన్​ఆర్​సీ అంశంలో ప్రధాని మోదీ అనేక మార్లు అసత్యాలు పలికారని ఆరోపించింది హస్తం పార్టీ. మోదీ- షా మాటలకు ఎంతో వ్యత్యాసం ఉందంది. ఇకపై నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించింది.

వీటన్నిటినీ చూస్తుంటే రాజ్యాంగం పట్ల భాజపా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తునట్టు అర్థమవుతోందని పేర్కొంది కాంగ్రెస్​. ఆ పార్టీ నేతలు ఎప్పుడూ రాజ్యాంగాన్ని చదవాలని స్పష్టం చేసింది.

Last Updated : Jan 3, 2020, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details