తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ నూతన ఐటీ చీఫ్​గా రోహన్​ గుప్తా - నాలుగు నెలల అనంతరం ఆమె స్థానంలో కొత్త వ్యక్తి

పార్టీ సామాజిక మాధ్యమ విభాగం ఛైర్​పర్సన్​గా రోహన్​ గుప్తాను నియమించింది కాంగ్రెస్​ పార్టీ. దివ్య స్పందన బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల కాంగ్రెస్​ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్​ నూతన ఐటీ చీఫ్​గా రోహన్​ గుప్తా

By

Published : Sep 29, 2019, 7:19 AM IST

Updated : Oct 2, 2019, 10:12 AM IST

పార్టీ సామాజిక మధ్యమాల బాధ్యతలను కాంగ్రెస్‌ కొత్త వ్యక్తికి అప్పగించింది. గుజరాత్‌కు చెందిన రోహన్‌ గుప్తాను సోషల్‌ మీడియా విభాగానికి చీఫ్‌గా నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది.

మొన్నటి వరకు సోషల్‌ మీడియా వింగ్‌ను నడిపిన ఆ పార్టీ మాజీ ఎంపీ దివ్య స్పందన ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇందుకోసం ఆమె స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. రోహన్ గుప్తా 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చీఫ్‌గా పనిచేశారు.

ఇదీ చూడండి : 'కార్టూనిస్టులకు పని కల్పిస్తోన్న ఇమ్రాన్​ఖాన్​'

Last Updated : Oct 2, 2019, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details