తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మా పార్టీ హయాంలో ఆరు లక్షిత దాడులు: కాంగ్రెస్​

తమ పార్టీ హయాంలో ఉగ్రవాదులను అణచివేసేందుకు లక్షిత దాడులు జరిపామని... కానీ సైనిక చర్యలను ఎన్నడూ రాజకీయాల కోసం వినియోగించుకోలేదని కాంగ్రెస్​ పార్టీ ప్రకటించింది. ఆరు లక్షిత దాడులను ప్రస్తావిస్తూ ఓ జాబితాను  విడుదల చేసింది​. హస్తం పార్టీ ప్రకటన మోసపూరితమని భాజపా ఆరోపించింది.

By

Published : May 2, 2019, 11:09 PM IST

ఆరుసార్లు లక్షిత దాడులు చేశాం: కాంగ్రెస్​

ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు యూపీఏ హయాంలో ఆరు లక్షిత దాడులు జరిగినట్టు కాంగ్రెస్ నేడు ప్రకటించింది. అయితే సైనిక చర్యలపై ఎన్నడూ రాజకీయం చేయలేదని హస్తం పార్టీ వెల్లడించింది. ఆ ఆరు లక్షిత దాడులకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ ప్రతినిధి రాజీవ్​ శుక్లా వెల్లడించారు.

కాంగ్రెస్​ చెప్పిన లక్షిత దాడుల వివరాలు

  • భట్టల్​ సెక్టార్​- పూంచ్​ (జూన్​ 19, 2008)
  • శారదా సెక్టార్​- కేల్​ (ఆగస్టు 30- సెప్టెంబర్​ 1, 2011)
  • సావన్​ పాత్రా చెక్​పోస్ట్​ (జనవరి 6, 2013)
  • నజాపిర్​ సెక్టార్​ (జులై 27-28, 2013)
  • నీలమ్​ లోయ (ఆగస్టు 6, 2013)
  • మరో లక్షిత దాడి (డిసెంబర్ 23, 2013​)
  • లక్షిత దాడులపై గత ప్రభుత్వాలు ఎన్నడూ మాట్లాడలేదని... కానీ మోదీ సర్కారు ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు శుక్లా.

భజన ఆపండి...

మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించడం వెనుక గత ప్రభుత్వాల కృషి, విదేశాల సహకారం ఉందన్నారు శుక్లా. ప్రతీ విషయానికి 'మేము చేశాం... మేము చేశాం' అని భజన చేయడం మానుకోవాలని భాజపా నేతలకు శుక్లా సూచించారు.

మసూద్​ అజార్​పై కాంగ్రెస్​ స్పందన

"మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం కోసం 15 ఏళ్లుగా నిరంతర ప్రక్రియ జరుగుతోంది. ఏ ఒక్క సర్కారుకో ఈ విజయాన్ని కట్టబెట్టాల్సిన అవసరం లేదు. విదేశీ ప్రభుత్వాలు ఇందుకు సహకరించాయి. వారందరికీ ధన్యవాదాలు. దేశంలో ప్రభుత్వాలు మారినా... ప్రతీ సర్కారు ఐరాసతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంటుంది. ఈ విషయంలో నిజాన్ని గుర్తించిన వారికి కృతజ్ఞతలు. కానీ.. ఒక సర్కారుకు ఈ విజయాన్ని కట్టబెట్టడం సరికాదు. ప్రతీ విషయానికి మేము చేశాం... మేము చేశాం అని ముందుకొచ్చి చప్పట్లు కొడతారు. దయచేసి ఆపండి."

--- రాజీవ్​ శుక్లా, కాంగ్రెస్​ ప్రతినిధి.

ఆ ప్రకటన మోసపూరితం...

మన్మోహన్​​ సింగ్​ హయాంలో లక్షిత దాడులు జరిగాయన్న కాంగ్రెస్​ ప్రకటనపై భాజపా తీవ్ర విమర్శలు చేసింది. ఆ ప్రకటన మోసపూరితమేనని... ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల హస్తం పార్టీ ఇప్పడు చింతిస్తోందని ఆరోపించింది.

ఇదీ చూడండి: ఆ ఒక్క మార్కు వచ్చి ఉంటే: సీబీఎస్​ఈ టాపర్​

ABOUT THE AUTHOR

...view details